Friday, January 1, 2016

My Life Event..!!!

Tuesday, April 8, 2014

కుటుంబ రాజకీయాలు... ఇంకెన్నాళ్ళు..?

తెలంగాణ పోరులో K.C.R ఎంతో పొరడారు. తెలంగాణా తెచ్చిన క్రెడిట్ మీకు కావాలి అనుకోవడం లో తపు లెధు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం లోకి రావాలి అనే మీ ఆలోచన ని ఎవరు ప్రశ్నించట్లేదు. కాని మీరు మీ కుటుంభం పైకి రావాలనే  ఉద్హేశం మాత్రం మంచిది కాదు. మీరు, మీ కొడుకు, కూతురు,అల్లుడు మొత్తం ఫ్యామిలీ అంత కట్ట కట్టుకొని ఎన్నికల్లో పోటి చేయడం మరీ ధారునమ్. ఇందు కోసమేనా మీరు తెలంగాన తెచ్చింది. తెలంగాణ అభివ్రుది చేయాలంటే మీరు అందరు అసెంబ్లీ కి పోవాల్సిన పని లేదు కద. ఎలాగు మీ పార్టి అధికారం లోకి వస్తది. వేరే వాళ్లకి అవకాశం ఇవ్వోచు కద. తెలంగాణ కోసం పోరాడిన ఎంతో మంది ప్రజా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా పార్టీ కి సేవ చేసిన ఎంతో మంది ఆ స్థానాల కోసం ఎంతో కష్టపడ్డారు వాళ్ళ అందరిని కాదని 3 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాలు మీరే తీస్కుంటే మనం ఉన్నదీ ప్రజాస్వామ్యం లోనా లేక రాజరికం లోనా?

తెలంగాణా కోసం మా కుటుంభం మొత్తం పోరాడింది కదా అప్పుడు మీరు అనలేదు అని మీరు ప్రశ్నించొచ్చు. "మేము తెలంగాన కోసం పోరాడింది కేవలం మా కుటుంభ శ్రేయస్సు కోసమే" అని ఒక్క మాట చెప్పండి మిమ్మలిని ఎవరు అడగరు. ఆ ఒక్క కుటుంభానికి మన తెలంగాణ ప్రజలు బానిసలు గా ఉండడం. చి.. ఇదేం ప్రజాస్వామ్యం? తెలంగాణ తెచ్చినందుకు అతన్ని ఆరాధించండి తప్పు లేదు కాని ఇలా ప్రజాస్వామ్య దేవాలయాలైన చట్ట సభల్లోకి కుటుంభం కుటుంభం వెళ్తుంటే మీరు హారతి పట్టడం ఏంటి ఇధి. ఈ కుటుంభ రాజకీయాలు పొవాలి. సామాన్యుడికి రాజకీయాలు అందుబాటులోకి రావలి. ప్రజా సేవ చేయాలి అని మనస్సు లో ఉన్న ప్రతివాడు ఏదో ఒక్కరూపం లో రాజకీయాల్లోకి రావడానికి వీలు ఉండాలి. వాళ్లకి పార్టీలు అవకాశం ఇవ్వాలి.

ఇది ప్రతి ఒక్క పార్టీకి వార్తిస్తుంది. కాంగ్రెస్ గురించి చెప్పదల్చుకోలేదు. వాళ్ళ అంత నీచ కుటుంభ రాజకీయాలు ఇంకా ఎవరు చెయ్యరు. వాళ్ళ పార్టీ మొత్తం తుదిచిపెట్టుకుపోతేనే దేశానికి మంచిధి. దరిద్ర్యం పొథది.అసలు వాళ్లకు దేశంలో ఉండే అర్హత లేదు అనేది నా ఉద్హేశం.

ప్రజలారా..! ఆలోచించండి... మనం ఉన్నదీ ప్రజాస్వామ్య దేశం లో అన్నది మర్చిపొకండి. ఆలోచించి వోటు వేయండి. చదువుకున్న అజ్ఞానులారా.... మీరు కూడా ఒక్క నిముషం అలోచించి ఓటు వేయండి.



Sunday, March 16, 2014

చదువుకున్న చేతకానివాడివా...?

మన ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, పాలకులు సేవకులు.
కాని ఇప్పుడు జర్గుతుంది ఏంటి? ప్రజలు వాళ్ళ వాళ్ళ రోజువారి పనిలో ఉంటె పాలకులు దేశాన్ని ధొచెస్థున్నరు. ఉదయం పేపర్ చదవుతుంటే అందులో వచ్చే వార్తలు చూసి 'చీ... వీళ్ళు ఇక మారరు.  దేశం మారదు. ' అని ఎంతో కోపంతో పేపర్ తిప్పేస్తాం మనం. అంతే కాని వాళ్ళనే మార్చి వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళని ఎన్నుకుంటాం అని మాత్రం ఆలోచించం. మల్లి ఎలక్షన్స్ వస్తాయి ఆ సమయం లో వాళ్ళు ఇచ్చె వెయ్యి రూపాయల నోటుకి, మద్యపానంకి, ఉచిత పథకాలకి ఆశపడి ఇన్నాళ్ళు వాళ్ళు చేసింది మర్చిపోయి మల్లి వాళ్ళకే జై కొడుతాము. వాళ్ళనే ఎన్నుకుంటాము. ఇదేనా మనం చెసెధి. అలా చేసి ఐదు సంవత్సరాలు అయింది. మనకి ఇప్పుడు మల్లి అవకాశం వచ్చింది.ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి కూడా అలాగే చేద్దామా? ఇంత చదువులు చదివి కూడా ఎం తెలియనట్టు మల్లి వాళ్ళకే వేద్దామా? చదువుకున్న చేతకానివాడిలా మిగిలిపోదామా? మీరే ఆలోచించుకొండి.



Friday, November 16, 2012

నమ్మకం..

నీ స్థాయి కి మించిన సహాయం చేస్తే ఆ దేవుడు నీ అర్హత కి మించిన ఫలితం ఇస్తాడు..
                                                                                         -నా నమ్మకం 

Sunday, July 22, 2012

అర్హుడా...?

దేశానికి సేవ చేసిన వారిని, ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన వారిని కుర్చోపెట్టాల్సిన కుర్చీలో ఒక పార్టీకి సేవ చేసాడని, ఒక వ్యక్తి  విశ్వాసం పొందాడని ఆ పదవిలో కుర్చోపెట్టడం మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా?
అవినీతి పై ఎంత ఉద్యమం జర్గుతున్నా ఆ అవినీతిపరులనే అందలం ఎక్కిస్తున్నారు మన నాయకులు. ఆ నాయకులకి  వంత పాడడం మన తెలివిగల (అని అనుకుంటున్న) ప్రజల వంతు..!

Sunday, June 10, 2012

మీరైనా చెప్పండి....

మూడేండ్ల క్రితం నాటి ఒకటి గుర్తువచ్చింది...
నేను మా ఊర్లో ఒక అతనితో మాట్లాడుతూ "ఎందుకయ్యా ఇలా పైసలు తిస్కోని ఓటు వేస్తారు? వాడు గెలిచాక మీకు ఏం పని చెయ్యడు, ప్రభుత్వం పైసలు అన్ని మేక్కుతాడు. ఇలా అయితే మీకు ఏం పనులు కావు.. తప్పు అయ్యా అన్నాను"... అప్పుడు అతను " తింటే తినని అయ్యా....! అవ్వి ఏమన మా ఇంట్లో సొమ్మా? ప్రభుత్వం సొమ్మే కదా..!" నాకు ఏం చెప్పాలో అర్ధం కాక మౌనంగా ఉండిపొయ్యా .
ఇంట్లో సొమ్ము.. ప్రభుత్వం సొమ్ము ఒకటే అని చెప్పే బాధ్యత నాపైనే ఉంది అని నాకు అప్పుడు తెలియలేదు.. ఇప్పుడు తెలిసినా చెప్పలేని దూరంలో ఉన్నాను.. మీరైనా చెప్పండి...

Wednesday, June 6, 2012

కార్యకర్తే పార్టీకి ఆధారం

ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్త అనేవాడు గుండెకాయ లాంటివాడు. పార్టీ సిద్ధాంతాలు ప్రజలకి చేరవేయడం కాని ప్రజల కష్టాలు, అవసరాలు తెల్సుకొని వారికి సహాయం చేస్తుంటాడు. ప్రజలు పెద్ద నాయకుల మాట వింటారో లేదో కాని ఆ కార్యకర్త ఒక గుర్తు చూపించి దాని పైన గుద్దు అంటే తప్పకుండ వేస్తారు. ఎందుకంటే అతడు వారకి నిత్యం అందుబాటులో ఉంటాడు(ప్రజల అవసరాలని క్యాష్ చేసుకునే వాలు కూడా ఉన్నారు. ఇప్పుడు నీతి గల కార్యకర్తల గురించి మాత్రమే మాట్లాడుకోవాలి).

నేను ఒక రాజకీయ పార్టీని చాలా దగ్గర నుంచి చూసాను కాబట్టి చెప్తున్నాను.మా నాన్న ఒక సంప్రదాయ పార్టీకి మండల స్థాయి కార్యకర్త(నేను మాత్రం కాదండోయ్). పార్టీ పైన ప్రజలకి నమ్మకం కల్గించి దాన్ని ఓటు రూపంలో మార్చే శక్తి కార్యకర్త కి మాత్రమె ఉంటుంది. కాని నేను కొన్ని కాన్ఫరెన్స్ కాల్స్ లో విన్నాను మన లోకసత్తా పార్టీ కి కార్యక్తలు లేని లోటు చాలా ఉందని. దానికి మనం ఎం చేయాలి? పార్టీకి కార్యకర్తల్ని తాయారు చేసుకోవాలి. పార్టీ కోసం తపించే వాలు కావాలి. మన ఆశయాలు, సిద్ధాంతాలు, ఆలోచనలు ప్రజలకి తెలియజేసే వాళ్ళు కావాలి. అలా మన పునాదులు నిర్మించుకోవాలి. 2014 ఇంకా ఎంతో దూరం లేదు, ఆ లోపు వీలైనంత వారకి పార్టీలో పనిచేసే వారకి వారి వారి సామర్ధ్యం బట్టి భాద్యతలు ఇవ్వాలని అభిప్రాయపడుతున్నాను.

ప్రతి గ్రామంలో గ్రామ కమిటిలు, బూత్ కమిటిలు వేస్తే చాలా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నాను. ఇందులో యువత మరియు రిటైర్ అయిన ఉద్యోగులకు అవకాశం ఇస్తే మంచిదని నా అభిప్రాయం. వారు ఇప్పటినుంచి స్థానికంగా ఉన్న సమస్యలు తేస్కోని పోరాడితే కొంచెం ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాను. ఒక్కో కార్యకర్త కనీసం 20 ఓట్లు సంపాదించినా అది మనకి కొండంత శక్తినిస్తుంది.